విశాలాంధ్ర -ధర్మవరం : మణిపూర్ లో మహిళలపై అక్కడి ప్రజలపై జరుగుతున్న హింసకు నిరసనగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీని నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో చేనేత కార్మిక సంఘం, రైతు సంఘం, ఐద్వా మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఉద్యోగ, కార్మిక ప్రజా సంఘాలతో కలిసి స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి కళాజ్యోతి, కాలేజీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం సిఐటియు మండల కార్యదర్శి అయూబ్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు.
ర్యాలీ నుద్దేశించి సత్యసాయి జిల్లా ఐద్వా అధ్యక్షురాలు, దిల్షాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. పెద్దన్న,సిపిఎం పట్టణ కార్యదర్శి. నామాల నాగార్జున మాట్లాడుతూ..
అంతులేని ఆకృత్యాలకు మణిపూర్ రాష్ట్రం కేంద్రంగా మారిందని, అక్కడి మహిళల కన్నీటి కథలు,డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యం, కుతంత్రాలను ఎత్తిచూపుతున్నాయన్నారు. అమానుషమైన ఈ ఘటనలను ఖండిస్తూ మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మతోన్మాద విద్వేష భావజాలం తలకిక్కిన మానవ మృగాల మరణకాండలో
దేశం కోసం పోరాడి తన కాలుని పోగొట్టుకున్న ఒక సైనికుడి భార్య కే ఇలా జరిగితే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. నిన్న వెలుగు చూసిన మరో సంఘటన స్వాతంత్ర సమరయోధుడు చుర చంద్ సింగ్ భార్యని కొంతమంది దుండగులు సజీవ దహనం చేశారని, ఇంత జరుగుతున్న అక్కడున్న
బిరేన్ సింగ్ ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరించడమే కాకుండా,
ఇంటర్నెట్ ను బంద్ చేసి అక్కడ జరుగుతున్న హింసాత్మకమైన ఘటనలు బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ వెంటనే రాజీనామా చేయాలి అని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు. ఆదినారాయణ,అయుబ్ ఖాన్, పెద్దన్న,.బాష, ఎస్ ఎఫ్ ఐ. ఖాసింవలీ, డివైఎఫ్ఐ బాలాజీ, షాక్షావలి,అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, యూనియన్ నాయకులు. డి.చంద్రకళ, పోతక్క,దీనా, అరుణ, చింతమ్మ, నూర్జహాన్, కృష్ణవేణి, భువన,మాంచాలి,
మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బాబు, చెన్నకేశవులు, వెంకటేష్, ప్రసాద్, ముకుంద,పెద్దక్క, నర్సమ్మ,దుర్గమ్మ, ముత్యాలు,
విద్యుత్ మీటర్ రీడర్స్ నాయకులు. దస్తగిరి, కిరణ్ కుమార్,
టాటా ఏసీ కమిటీ నాయకులు
సుబ్రహ్మణ్యం, కుళ్లాయప్ప, ముస్తఫా,మురళి, రమేష్, సయ్యద్,చంద్ర,ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.