ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు.
విశాలాంధ్ర -ధర్మవరం : విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు మా పోరాటాలు ఆగవని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కురుబ జగదీష్, జిల్లా ఆర్గనైట్ కార్యదర్శి ఇర్షాద్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ తోట వాసుదేవా, టిఎన్ఎస్ఎఫ్ ధర్మవరం అసెంబ్లీ అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షులు సాకే వినోద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పిలుపుమేరకు కేజీ నుండి పీజీ స్థాయి వరకు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు బందును నిర్వహించాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మ ఒడి పథకాన్ని కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇవ్వాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకమును వర్తింపజేయాలని, నెప్ -20 రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, కార్పొరేట్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాహక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల నిధులను తక్షణమే విడుదల చేయాలని, డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశపెడుతున్న మేజర్ మైనర్ సబ్జెక్టుల విధానాన్ని విరమించుకోవాలని తెలిపారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మెగా డీఎస్సీను నిర్వహించాలని, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనుకబడిన హాస్టల్స్ మౌలిక వసతులను కల్పించాలని, హాస్టల్లో అన్ని పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు మినరల్ వాటర్ పంపిణీ చేయాలని, హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని, మహిళల వసతి గృహాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బంద్ విజయవంతం పట్ల ప్రత్యక్షంగా,పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శివ ఎం ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షుడు బండారు చైతన్య అసెంబ్లీ కార్యదర్శి చెన్నూరు వినోద్ చిన్నూరు నాగరాజు తిరుపాలు రూరల్ అధ్యక్షులు అశోక్ సాయికిరణ్, జైపాల్, వినయ్, త్రివిక్రమ్, పురుషోత్తం, మురళి, యాసిన్, వినోద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.