విశాలాంధ్ర. నందికొట్కూర్ : నందికొట్కూరు పట్టణంలోని స్థానిక పటేల్ సెంటర్ నందు షేక్ అబ్దుల్ రసూల్ ఖాన్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫేమస్ ఫుట్వేర్ షాప్ ను మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంకృషితో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫుట్వేర్ షాప్ నుంచి రసూల్ ఖాన్ రోజురోజుకు అభివృద్ధి చెంది బాగుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సుకూర్మియా, కౌన్సిలర్ ధర్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉషనయ్య, నంద్యాల జిల్లా వైసీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు వెంకటరమణ, సలాం ఖాన్, రషీద్ ఖాన్, తమ్మడపల్లి విక్టర్, జాన్, అయ్యన్న, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.