ఆదర్శ పార్కు నిర్వాహకులు
విశాలాంధ్ర – ధర్మవరం : వీర మరణం పొందిన సైనికులను స్మరించుకోవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని ఆదర్శ సేవా సంఘం- ఆదర్శ పార్కు నిర్వాహకులు, కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిఆర్టి వీధి లో గల ఆదర్శ పార్కులో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వీర మరణం పొందిన సైనికులకు ప్రగాఢ సంతాపంతో పాటు ఘనంగా నివాళులర్పించారు. సైనిక స్థూపం వద్ద పూలు ఉంచుతూ,అందరూ సెల్యూట్ చేయడం జరిగింది. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ 1999 సంవత్సరంలో పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 527 మంది వీర మరణం పొందడం జరిగిందన్నారు. ఈ రోజునే అమర జవాన్లకు కార్గిల్ విజయ్ దివాస్ రోజుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. వీర జవాన్డు మృతి చెందడం బాధాకరమైన దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం, మరుపురాని రుణము తీర్చికోలోని విషయమని తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించడం దేశభక్తిని చాటుకోవడమేనని తెలిపారు. భరతమాత నుదుటిపై వీర తిలకం దిద్ది, కార్గిల్ యుద్ధంలో శత్రువులు తరిమి కొట్టిన వీర సైనికుల తెగువను, మనమందరము స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనాలకు కృషి చేయాలని తెలిపారు. దేశ సమగ్రత, భద్రత కోసం సైనికులు వీర మరణం పొందడం జరిగిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకాశ్మీర్లోని అవుట్ పోస్టులను ఇండియన్ ఆర్మీ విజయవంతంగా తిరిగి కైవసం చేసుకున్న ఈ రోజును కార్గిల్ విజయ్ దివాసుగా జరుపుకుంటున్నామని, ఈ యుద్ధంలో దేశం కోసం పోరాడుతూ, అసువులు బాసిన భారత అమర జవాన్లకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, చిన్న ప్రకాష్, డి. నాగభూషణం,దాసంశెట్టి నాగభూషణం, నరేందర్ రెడ్డి, పవన్ కుమార్, జి .నాగార్జున,టీచర్ వేణుగోపాల్ తో పాటు మాజీ మిలిటరీ సైనికులు పాల్గొన్నారు.