శాంటియాగో: విద్యా రంగంలో మెరుగుదల, మెరుగైన వేతనాలు, పింఛన్, బకాయిల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం చిలీ టీచర్ల అసోసియేషన్ (సీటీఏ) అధ్వర్యంలో రాజధాని శాంటియాగోలో అధ్యాపకులు 24గంటల సమ్మె నిర్వహించారు. సమ్మెలో భాగంగా దేశవ్యాప్తంగా సమావేశాలు, ర్యాలీలను చేపట్టారు. ప్లాజా డె లా డిగ్నిడాడ్ నుంచి అవెన్యూ ఆఫ్ లా అలమేడా వరకు భారీ ప్రదర్శన జరిగింది. అగస్టో పినోచెట్ నిరుంకుశత్వం (1973`90)లో వేతనాల్లో కోతల వల్ల పింఛన్లు తగ్గిపోవడం ద్వారా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీచర్లు నష్టపోయారని, అందుకు నష్టపరిహారం చెల్లించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో హింస, రిటైర్మెంట్ బోనస్ల చెల్లింపుల్లో జాప్యం, విద్యా రంగ ఆర్థిక నమూనాలో మార్పులు, పని ఒత్తిడి తగ్గించడం కోసం డిమాండ్ చేశారు. తమ న్యాయబద్ధ డిమాండ్ల సాధన కోసం సమ్మెను చేపట్టినట్లు టీచర్ల యూనియన్ పేర్కొంది. తమ డిమాండ్లలో చాలా వరకు ఎన్నికల ప్రచారం క్రమంలో అధ్యక్షుడు గోబ్రియల్ బోరిక్ ఇచ్చిన హామీలేనని వెల్లడిరచింది. ఈ మేరకు అధ్యక్షుడికి లేఖ రాసినట్లు పేర్కొంది.