విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణ ముస్లిం జనాభా పెరుగుదలకు అనుకూలంగా వారి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పామిడి అజీమ్ భాషను ఉరవకొండ పట్టణ అదనపు కాజీగా నియమించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఎండి ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కాజీ ని నియమించడం పట్ల గురువారం ఉరవకొండలో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు.