విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి విశిష్ఠ సేవలందించిన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మరో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. 4వ తరానికి చెందిన డా విన్సీ ఐ రోబోను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ రోబోను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గురువారం ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మణిపాల్ ఎంటర్పైజెస్ ఛైర్మన్ డా. సుదర్శన్ బల్లాల్, మణిపాల్ హాస్పటిల్ విజయవాడ డైరెక్టర్ సుధాకర్ కంటిపూడి ఇతర ప్రముఖలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ వైద్యరంగంలో మరోకొత్త చరిత్రకు మణపాల్ హాస్పిటల్ తెరతీసిందని చెప్పారు. రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీతో ఆంధ్రప్రదేశ్ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అందుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్స్ వారు ప్రవేశపెట్టిన ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్మెంట్ అనేది ఏపీ ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు.