విశాలాంధ్ర – కర్నూలు సిటీ : సాధారణంగా కాలేయంపై తీవ్ర ప్రభావం చూపే
హెపటైటిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని లయన్స్ అడిషనల్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ స్వచ్ఛంద సేవ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం స్థానిక వెంకటరమణ కాలనీలోని కెఎన్ఆర్ స్కూల్ ఆవరణలో 9, 10 వ తరగతి విద్యార్థులకు ఃహెపటైటిస్ వ్యాధి లక్షణాలు- తీసుకోవలసిన ముందు జాగ్రత్తలుః అనే అంశంపై అవగాహన, వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ హెపటైటిస్ బి వైరస్ ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారుచ్ శామ్యూల్ బ్లూమ్ బర్గ్ గౌరవార్థం ఆయన జన్మదినాన్ని ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యదర్శి లయన్ సి గోవర్ధనగిరి, కేఎన్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ లయన్ గోపీనాథ్ ,లయన్ పవన్, లయన్ మంజునాథరెడ్డి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు