విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి సాగునీరు ప్రాజెక్టును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 9న సందర్శన చేయడానికి విచ్చేయచున్నారని టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తోటపల్లి బ్యారేజి సందర్శన అనంతరం అక్కడనుండి పార్వతీపురం వరకు రోడ్ షో ఉంటుందని తెలిపారు. ఆరోజు రాత్రి పార్వతీపురంలో రాత్రిబస, మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మరుసటి రోజున ఇక్కడనుండి బయలుదేరి శ్రీకాకుళం వెళ్తారని చెప్పారు.
కొత్తనియోజకవర్గ ఇంచార్జి రేపురాక:
పార్వతీపురం టిడిపి నియోజకవర్గ ఇంచార్జిగా పార్టీ అధిష్టానం కొత్తగా నియమించిన బోనెల విజయ్ చంద్ర సోమవారం పార్వతీపురం విచ్చేసి బాధ్యతలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమాచారం తెలిపినట్లు జగదీష్ తెలిపారు.సోమవారం ఉదయం 11గంటలకు పార్వతీపురం మండలంలోని నరిసిపురం చేరుకొని, అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి పాదయాత్రగా పార్వతీపురంపార్టీ కార్యాలయానికి వస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని మూడు మండలాల నాయకులు,అభిమానులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొనాలని పార్టీ సూచించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం పట్టణ, గ్రామీణ అద్యక్షులు రవికుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.