విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని నందలపాడులో శనివారం ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. మొదటగా మొహరం సందర్భంగా పీర్ల స్వాములకు వస్త్రాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించి చదివింపులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఉదయం ఆరు గంటల సమయంలో పీర్లు ఎత్తుకొని గ్రామంలోని ఇంటింటి వద్ద గ్రామ ప్రజలు ఒక బింద నీళ్లు, చక్కెర, లడ్డు, బొరుగుల తో స్వామివారికి చదివింపులు చదివించి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి వేడుకలు తిలకించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు పీర్ల స్వాములు జలధికి వెళ్లాయి. గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.