బెంగళూరు: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశపు అతిపెద్ద ఈవీ ద్విచక్ర వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏథర్ గ్రిడ్ను మరింత బలోపేతం చేసి, విస్తరించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక సహకారం ద్వారా ఏథర్ ఎనర్జీ భారతదేశం వ్యాప్తంగా 21,000 ఫ్యూయల్ స్టేషన్లను కలిగిన బీపీసీఎల్ విస్తృతమైన నెట్వర్క్కు అనుబంధంగా ఏథర్ పబ్లిక్ ఫాస్ట్-చార్జింగ్ గ్రిడ్ను నెలకొల్పేందుకు అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఏథర్ ఎనర్జీ ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద ఈవీ ద్విచక్ర వాహనాల ఛార్జింగ్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది 100 నగరాల్లో 1,400 కన్నా ఎక్కువ ఛార్జర్లు ఉన్నాయి. బీపీసీఎల్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా, ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు వృద్ధి చెందుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా, ఏథర్ గ్రిడ్ విస్తరణను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.