విశాలాంధ్ర – శెట్టూరు : సీజనల్ వ్యాధిలుపట్ల అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి తిరుపాలయ్య టీబి సూపర్వైజర్ సత్యనారాయణ పేర్కొన్నారు మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ తరుణసాయి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయం వారీగా ఆయా ఎఎన్ఎమ్ లు , ఎంఎల్.హెచ్.పీ లు వారి లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఎన్.సీ.డీ సీడీ ఆర్సీహెచ్,రక్తహీనత, హైరిస్కుతో ఉండే గర్భిణీ స్త్రీలు , ఆరోగ్య శ్రీ ఆపరేషన్ చేయించుకున్నవారి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలించేఅవకాశం ఉన్నందున ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జ్వరం కేసులు ఎన్ని ఉన్నాయో వాకబు చేసి ఎఎన్ఎమ్ లకు , ఎంఎల్.హెచ్.పీ లకు గానీ లేదా అధికారులకు తెలియచెప్పాలని తెలియజేశారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఫ్రైడే డ్రైడే పాటించి నీటి తొట్టెల్లో ఉన్న దోమల లార్వాలను తొలగించాలని అదేవిధంగా జ్వరం కేసులు నమోదు అయిన వెంటనే వారి ఇంటి పరిసరాల్లో చల్లడానికి అబేట్ , పైరిత్రమ్ మందు పీహెచ్ సీ లో అందుబాటులో ఉంచామని రెండు వారాలకంటే ఎక్కువ దగ్గు సాయంత్రం పూట జ్వరం బరువు తక్కువ ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న వారిని కళ్ళె పరీక్ష కోసం సమీప కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి పంపవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ వో శోభాలత , పీహెచ్ఎన్ సరోజమ్మ , సూపర్ వైజర్లు లీలావతి,సుమతి టీబీ ఎస్టీఎస్ శివకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ మంజు ఎంఎల్.హెచ్.పీ లు శిరీష, మౌనిక, రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్లు జాన్సన్ బాబు, మునిరత్నం, హనుమంత రాయుడు,పవన్ ఎఎన్ఎమ్ లు శాంతమ్మ, మాధవి,చిట్టెమ్మ, సుజాత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.