Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అందరి ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించాను..

అంబటి త్రిలోక్ గాయత్రి.
విశాలాంధ్ర -ధర్మవరం : ఎండి. పాతాలజి ఆంధ్ర ప్రదేశ్ లోనే స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించడం అందరి ప్రోత్సాహంతోనే జరిగింది అని ధర్మవరానికి చెందిన అంబటి త్రిలోక్నాథ్ కుమార్తె అంబటి త్రిలోక్ గాయత్రీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం గాయత్రి విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (రుయా హాస్పిటల్) ఎండి కోర్సులు మూడు సంవత్సరాలుగా (2020-23) కొనసాగించానని తెలిపారు. ఈ రిజల్ట్ సోమవారం రాత్రి వెబ్సైట్లో విడుదల చేశారని, అనంతరం తన ర్యాంకు చూసి, నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ ర్యాంకును తాను ఊహించలేదని తెలిపారు.చిన్న వయసు నుంచే నాన్న అంబటి త్రిలోక్ నాథ్, తల్లి అంబటి వనిత తన చదువు పట్ల ప్రోత్సహించారని తెలిపారు. వివాహం అనంతరం తన చదువును వెన్నంటే ఉండి భర్త వెంకట వినీత్-(డాక్టర్ జనరల్ సర్జన్-మంగళగిరి-ఏఐఐఎంఎస్) ప్రోత్సహించి ఇంతటి స్థాయిని తెప్పించడం నాకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా మా కాలేజీ ప్రొఫెసర్ ఎప్పటికప్పుడు నా చదువుకు వెన్నంటే ఉంటూ, ప్రతి సమస్యను, అనుమానాలను నివృత్తి చేయడం వల్లనే ఇంతటి ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తాను సమాజంలో సేవా కార్యక్రమాలను చేస్తానని, వైద్య వృత్తికి మంచి గుర్తింపు తెస్తానని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తదుపరి తల్లిదండ్రులు మాట్లాడుతూ తన కుమార్తె చిన్నప్పటినుండి చదువు పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేదని, పట్టుదల, లక్ష్యంతోనే స్టేట్లో సెకండ్ ర్యాంక్ రావడం, ధర్మవరం నకు మంచి గుర్తింపు తేవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు కుమార్తెకు స్వీటును తినిపించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img