విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు గురువారం మూడవ తేదీన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం కియా సందర్శన మరియు గొల్లపల్లి రిజర్వాయర్ ను పరిశీలించనున్నారు కావున భద్రత ఏర్పాట్లను బుధవారం సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సమీక్షించారు భద్రతగా ఉన్న పోలీసులకు దిశా నిర్దేశం చేస్తూ బందో బస్సులు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధుల్లో ఉన్న సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు ఆయనతో పాటుగా డీఎస్పీ హుస్సేన్ పీరా సిఐ కరుణాకర్ కియా ఎస్ఐ వెంకటరమణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.