విశాలాంధ్ర – మండవల్లి: ప్రస్తుతం వర్షాకాలం కారణంగా కళ్ళ కలక సమస్య ఎక్కువగా ఉందని దానివల్ల విద్యార్థులకు కళ్ళు కలకలు సోకే అవకాశం ఎక్కువగా ఉందని అందుకు ముందస్తుగా ఏలూరు జిల్లా బిసి నాయకులు శొంఠి కుమారస్వామి తన సొంత కర్చులతో కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. బుధవారం మండలంలోని కానుకొల్లు గ్రామంలోని అంగన్వాడీ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 300 మంది విద్యార్థులకు కుమారస్వామి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ స్వామి మాట్లాడుతూ వర్షాకాలంలో కండ్ల కలక ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇది ఒకరి నుంచి ఒకరికి కంటి ద్వారా వ్యాపిస్తుందని దాని బారిన విద్యార్థులు పడకూడదనే తలంపుతో కళ్ళజోళ్ళు పంపిణీ చేశానన్నారు. అనంతరం దాత కుమారస్వామిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్ వై మాధవ కుమార్, ఉపాధ్యాయులు కురేళ్ల శ్యాం కుమార్, భాగ్య కుమారి,శివ తదితరులు పాల్గొన్నారు.