ముంబయి: ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న స్మార్ట్ పరికరాల బ్రాండ్ ఒప్పో భారతదేశంలో ఒప్పో ఏ78 విడుదలను ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ రెండు రంగుల ఫినిష్లో అందుబాటులో ఉంటుంది. అవి : ఆక్వా గ్రీన్, మిస్ట్ బ్లాక్. ఆక్వా గ్రీన్ ఏ78 నీటి-ఆకుపచ్చ బేస్ పొరపై ఒప్పో మొదటి డైమండ్ మ్యాట్రిక్స్ డిజైన్ను సూపర్ఇంపోస్ డబుల్-లేయర్ ప్రక్రియను ఉపయోగిస్తుంది. మిస్ట్ బ్లాక్ వెర్షన్ దాని స్వచ్ఛమైన నలుపు బేస్లో పసుపు-ఆకుపచ్చ స్పర్శతో వస్తుంది. ఇది ఫోన్కు ప్రత్యేకమైన మెటాలిక్ గ్లాస్ను ఇస్తుంది. అల్ట్రా స్లిమ్ రెట్రో డిజైన్,2.5డీ రైట్ యాంగిల్ మిడిల్ ఫ్రేమ్,స్మూత్ చేయబడ్డ అంచులతో ఫోన్ సొగసైనదిగా, పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. వినియోగదారులకు ఈ ఫోన్ ఆగస్టు 1 నుంచి రూ.17,499 ధరకు మెయిన్లైన్ రిటైల్ ఔట్లెట్లు, ఒప్పో ఈస్టోర్, ఫ్లిప్కార్ట్ల ద్వారా లభ్యంకానుంది.