Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై 7న రౌండ్ టేబుల్ సమావేశం

విశాలాంధ్ర -ఉరవకొండ : ఈ నెల 7న అనంతపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సిపిఐ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల పట్ల సీఎం జగన్ కు చిత్తశుద్ది లేకుండా పోయిందని ఆరోపించారు. అగ్రిగిల్డ్ సంస్థ దివాలా తీయడంతో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఏజెంట్లు, ఖాతాదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను అధికారంలో కి వచ్చిన ఆరు నెలలకే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని నమ్మబలికి ఓట్లు దండుకుని నేడు వారికి న్యాయం చేయడం లేదని విమర్శించారు. అగ్రిగొల్డ్ బాధితుల పట్ల ఆగస్టు 15 లోపు సీఎం జగన్ తన హామీని నెరవేర్చాలని లేనిపక్షంలో బాదితులందరూ అమరావతి రాజధానికి చేరుకొని ఎపి అసెంబ్లీ సహా సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.అందులో భాగంగానే  ఈనెల 7న అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశానికి అగ్రి గోల్డ్ బాధితులు అందరూ కూడా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్ని గోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్దేశ్వర్, తిమ్మరాజు,సిపిఐ పార్టీ నాయకులు సుల్తాన్, బాధితులు మహేష్ ప్రభాకర్, సుదర్శన్, భాస్కర్, త దితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img