విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండలం నందు గురువారం ఓటర్ సర్వే అధికారులు క్షేత్ర పర్యటన నిర్వహించారు ఎన్నికల సంవత్సరం 2024 స్పెషల్ సమ్మరి రివిజన్ భాగంగా హౌస్ టూ హౌస్ సర్వే బూత్ లెవెల్ అధికారులు హౌస్ టూ హౌస్ వెళ్లి సర్వే చేసే భాగంలో జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు సర్వే జరుగును.ఈ సర్వే భాగంలో పెనుకొండ తహశీల్దార్ స్వర్ణలత డిప్యూటీ తహశీల్దార్ హనుమంతు,ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ గణేష్ కుమార్,ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ చౌడయ్య, సర్వే ప్రత్యక్షంగా వెంకటరెడ్డి పల్లి పొలింగ్ స్టేషన్ నంబర్ 167,168,మరియు ఇస్లాపురం పొలింగ్ స్టేషన్ నంబర్ 166 పర్యవేక్షించి బి ఎల్. ఒ . లు ఎన్ని ఇల్లు తిరిగారు, యాప్ వర్క్ అవుతుందా లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని క్షుణ్ణంగా తెలుసుకొన్నారు..అలాగే పెనుకొండ లో ఉన్న అర్బన్ మరియు రూరల్ ఓటర్లు బి.ఎల్.ఓ లకు సహకరించాలి ప్రజలకు తెలియజేయడం జరిగింది , అలాగే ప్రతి ఇంటిలో 18 ఏళ్లూ నిండిన ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును కల్పించాలని,ఓటరు జాబితాలో తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొనే అవకాశం ఉంది అని మీ పరిధి లోని ప్రతి ఓటర్ కి తెలియ జేయలని మరియు మరణించిన వారి ఓట్లను తొలగించాలని తప్పులు లేని ఓటర్ జాబితాను తయారు చేసే బాధ్యత ప్రతి బి.ఎల్.ఓ దే అని తెలియజేశారు.అలాగే హౌస్ టూ హౌస్ ప్రోగ్రాం ను బి.ఎల్.ఓ లకు ఇచ్చిన సమయం లో పూర్తి చేయాలని మరియు విజయవంతం చేయాలని తాసిల్దార్ ,ఎలక్షన్ డిప్యూటీ తాసిల్దార్, దిశా నిర్దేశం చేశారు.