ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పేదల బ్రతుకుల్లో వెలుగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నింపడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని 41 వార్డులో “గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం” నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చేపట్టిన నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరించారు. ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి గ్రామ ప్రజలు విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని ప్రమాదంగా ఉన్నాయని, మరి కొంతమంది సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, కోరగా త్వరలోనే నిధులు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి, నూతన విద్యుత్ స్తంభాలను అమర్చాలని విద్యుత్ శాఖ అధికారులను వారు ఆదేశించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. నవరత్నాల పేరిట ఎంతోమంది పేద ప్రజలు కూడా లబ్ధి పొందడం నాకు ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు 13000 మందికి పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తదుపరి సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అర్హులైన వారికి అందించాలని వారు తెలిపారు. అంకిత భావంతో సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని తెలిపారు. చిన్నపాటి ఆరోపణలు వస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, కౌన్సిలర్ మట్టెద్దుల సుజాత, వార్డు ఇన్చార్జ్ మట్టెద్దుల కేశవరెడ్డి, నాయకులు అంజన్ రెడ్డి, హనుమంతు, వేమ నారాయణరెడ్డి, కాంట్రాక్టర్ ఆదినారాయణ రెడ్డి,వడ్డే ఆది, బాబు, పీరా తదితరులు పాల్గొన్నారు.