విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు గురువారం మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి కార్యక్రమం పరిశ్రమలు వలన అనంతపురం జిల్లాకు కలుగు మేలు గురించి ప్రజలను మేల్కొల్పడానికి పెనుకొండ నియోజకవర్గనికి విచ్చేసినందున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కార్యకర్తల అందరికీ ఉత్తేజపరచడానికి ఆమె బుల్లెట్ నడుపుతూ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ ఉరుకుల పరిగెత్తించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ వారికి మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ను గజమాలతో సత్కరించి కియా పరిశ్రమ చంద్రబాబు ఉన్నా ఫోటోను బహికరించారు కార్యకర్తలు పెద్ద ఎత్తున సవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అలాగే ఆమె యువతకు ఐకాన్ గా వర్ణిస్తూ యువత ఆమెను అనుసరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.