విశాలాంధ్ర -కలువాయి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆ సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆశీర్వదించాలని వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి కోరారు.మండలకేంద్రంలోని కలువాయి-2 సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిం చారు. ముందుగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి కి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలు గురించి వివరించి, బుక్ లెట్లు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మరో సారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవ ద్దన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఎస్టీ కాలనీ వాసులలోని ఎరుకులకు సంబందించిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబందించి త్వరలో పరిష్కారం చూపి వారికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, బి.అనీల్ కుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీదేవి, ,సర్పంచ్ పెంచలమ్మ, మండల కన్వీనర్ ఎంవీ.కృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు చాలా సుభారామిరెడ్డి, ఎమ్మార్వో జీ. స్వర్ణ ,ఎంపీడీవో. నారాయణ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పోలిశెట్టి వంశీకృష్ణ , చల్లా భక్తవత్సల రెడ్డి, మరియు వైసిపి కార్యకర్తలు అభిమానులు, మరియుసచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.