విశాలాంధ్ర- బొమ్మనహళ్ : మండలంలోని ఉద్దేహళ్ గ్రామం లో వైద్య అధికారులు శ్రీ లక్ష్మీ మల్లేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య సిబ్బంది తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి తల్లిపాలు ప్రాముఖ్యత పై గర్భవతులు బాలింతలు ,ప్రజలకు అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగిం చాలని , ఆపాలే మొదటి వాక్సిన్ లాగా బిడ్డ వ్యాధినిరోధక శక్తిని పెంచు తాయని, తియ్యటి పానీయాలు ,పోతపాలు త్రా గించరాధని ,అవి బిడ్డకు నిమోనియా ,డయేరియా వ్యాధులను కలగచేస్తా యని ,బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లి పాలు త్రాగించి ,ఆతర్వాత అదనపు ఆహారం ఇవ్వవచ్చని ,నిర్ణీత కాలమాన ప్రకారం బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి ప్రజలకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు గోవర్ధన్ ఎం ఎల్ హెచ్ పి నాగమణి ఏఎన్ఎం జై నాభి ఎం పి హెచ్ ఎస్ రుక్మిణి ఆశా కార్యకర్తలు లక్ష్మీ హరిత లక్ష్మీ ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు