విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ : మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం లో బి.టెక్ మూడవ సంవత్సరం చదువుతున్న పీ. పవిత్ర , కె. సాజిద లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కాంచీపురం లో ఆరు వారాలు ఇంటెర్షిప్ విజయ ఫలాలను సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ ఇంటర్న్షిప్ (రిస్క్) లో భాగంగా మెషిన్ లెర్నింగ్ యూసింగ్ పైథాన్ పై విద్యార్థులకు ఈ ఇంటెర్షిప్ లభించినట్లు, విద్యార్థులకు కోవిడ్ పేస్ మాస్క్ డిటెక్షన్ ఉసింగ్ సి యెన్ యెన్ అల్గోరిథం పై ప్రొఫెసర్ కాకర్ల జగదీశ్ ఆద్వర్యం లో పరిశోధన చేశారు. ఈ ఇంటెర్షిప్ లో అధ్యయనం చేసిన విద్యార్థులను, ప్రశంస పత్రాలను అందజేశారని, ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల కరెస్పాండంట్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ అభినందనలు తెలిపారు.