విశాలాంధ్రబ్యూరో-నెల్లూరు: పార్లమెంటులో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఉపాధిహామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థపై బుధవారం రాజ్యసభలోకేంద్రానికి పలు ప్రశ్నలు వేశారు.ఆధార్ ఆధారిత చెల్లింపులతో ఉపాధి హామీ కూలీలు ఎలాంటిసమస్యలుఎదుర్కొంటున్నారు?అలా అయితే సమస్యల దృష్ట్యా ఏబిపిఎస్ జూన్ 2023 తర్వాత పొడిగించబడిందా?ఉపాధి హామీ కూలీవ్యక్తిగత ఖాతానునేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానించడంలో ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖ ఎలా పరిష్కరిస్తుందో తెలియజేయాలని ప్రశ్నించగా దానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానమిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కింద జాబ్ కార్డుల ఆధార్ సీడింగ్ చేస్తున్నట్లుపేర్కొన్నారు.జాబ్కార్డులను ఆధార్తోఅనుసంధానించడం వల్ల ఈ ఎంజీఎన్ఆర్జీఎస్లోపారదర్శకత పెరగడంతో పాటు,డూప్లికేషన్,జాబ్ కార్డ్లదుర్వినియోగాన్నినిరోధించవచ్చన్నారు. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపులవ్యవస్థను 2023, ఫిబ్రవరి1,నుంచి తప్పనిసరిగా అమలుచేయాలనిఅన్నిరాష్ట్రాలకు సూచించామన్నారు.కానీపలురాష్ట్రాలఅభ్యర్థనలనుదృష్టిలోఉంచుకుని ఆగస్టు31,2023 వరకు చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ లేదానేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్మోడ్ ద్వారా నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖ అనుమతించిందని వివరించారు.రాష్ట్రాలుకూడాఉపాధి హామీలబ్ధిదారులఆధార్ సీడింగ్ కోసం బ్యాంకుల ద్వారా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకులు ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల ఆధార్నెంబర్లను నేషనల్ పేమెంట్స్కార్పొరేషన్ఆఫ్ఇండియాలోనమోదుచేయాలన్నారుఒకవేళరాష్ట్రాలులేదాకేంద్రపాలితప్రాంతాలుఈవిషయంలోఏవైనాసమస్యలుఎదుర్కొంటే ప్రాధాన్యక్రమంలోవాటినిపరిష్కరిస్తామని పేర్కొన్నారు.