విశాలాంధ్ర ధర్మవరం: గుంటూరులో ఆగస్టు 12 , 13 తేదీలలో జరుగుతున్న ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యు) మహాసభలను జయప్రదం కాంక్షిస్తూ ధర్మవరం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిష్టమూర్తి, ట్రెజరర్ బిల్లే రవి, మాజీ అధ్యక్షులు కృష్ణయ్య, సీనియర్ న్యాయవాదులు కృష్ణమోహన్ , కరీం, జిల్లా అధ్యక్షులు వీరు యాదవ్, కార్యదర్శి సతీష్, ఉపాధ్యక్షులు సూర్యచంద్ర యాదవ్, ప్రసాద్, మల్లేష్ ఆవరణంలోపోస్టర్స్ విడుదల చేయడం చేశారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుత మహాసభలను మొదటి రోజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రారంభిస్తారని, రెండో రోజు సమావేశంలో ప్రముఖ న్యాయవాది, లౌకికవాదం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కు గొప్ప కృషి చేస్తున్న తీస్తా సెతల్వాడ్ పాల్గొంటారాని, అలాగే ఈ క్రమంలో న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్ర శాసనసభలో ప్రైవేటు బిల్లు తేవటానికి,జూనియర్ న్యాయవాదులు , మహిళా న్యాయవాదులు ప వృత్తిపరమైన సమస్యలపైన ఇటీవల న్యాయవాదులపై పెరుగుతున్న దాడులపైన, అలాగే ఉమ్మడి పౌరస్మ్మతి పేరుతో భారత రాజ్యాంగానికి ఏర్పడుతున్న ప సవాళ్ళులపైనా, ఇటు వృత్తిపరమైన సమస్యలపైనా , అటు సామాజికపరమైన సమస్యలపై సముగ్ర చర్చలు జరిపి, తీర్మానాలు రూపొందించి, వాటి అమలు కోసం న్యాయవాదుల తో సమిష్టిగా ఐలు రాష్ట్రంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వీరు యాదవ్,సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు సూర్యచంద్ర, ప్రసాద్,మలేష్ , న్యాయవాదులు మహేష్ భాస్కర్ , మోహన్ ప్రసాద్ ,నరసింహమూర్తి, పెద్దన్న, బిల్లే నరేంద్ర ,శివకుమార్, సాకే వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు