విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల అనంతపురంలోని ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ శిక్షణలో ధర్మవరం విద్యార్థులు ప్రతిపను కనపరిచి జిల్లా సాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంత జిల్లా జట్టు తరఫున ఎంపికైన అనుష్క, లిఖిత, మైత్రి లను క్రికెట్ అసోసియేషన్ ధర్మవరం మండల అధ్యక్షుడు వడ్డే బాలాజీ కార్యదర్శి శంకర్ కోచ్ రాజశేఖర్ లు బుధవారం గుట్ట కింద పల్లి లో ఉన్న ఆర్డిటి క్రీడా మైదానంలో అభినందించి, ప్రోత్సాహక బహుమతులను వారు పంపిణీ చేశారు. ఎంపికైన విద్యార్థులు వెంకటగిరి లో ఇచ్చే శిక్షణకు బయలుదేరి వెళ్లడం జరిగిందని క్రికెట్లో మరింతగా రాణించి ధర్మవరంకు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని వారు ఆకాంక్షించారు.