మోదీ ఇంటిపేరు అనే వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కొలీజియం బదిలీకి సిఫార్సు చేసింది. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆ జాబితాలో జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ కూడా ఉన్నారు. జులైలో 123 పేజీల తీర్పులో జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్, రాహుల్ గాంధీ అభ్యర్థనను తిరస్కరించారు. దోషిపై స్టే విధించడానికి ఎటువంటి కేసు చేయలేదని చెప్పారు. దీనికి సంబంధించి గత రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం.. ఁమెరుగైన న్యాయం కోసంఁ బదిలీలను కొలీజియం సిఫార్సు చేసింది.