విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం నాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ధర్మవరం బ్రాంచ్ అధికారుల సహకారంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఁడ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ దిశగాఁ అనే అంశంపై అవగాహన సదస్సును సె బ్ సీఐ. లక్ష్మీ దుర్గయ్య నిర్వహించారు. అనంతరం లక్ష్మీ దుర్గయ్య మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వలన వచ్చే ఇబ్బందులను, జబ్బులను, వాటి ద్వారా సంభవించే ప్రమాదాలను గూర్చి విద్యార్థులకు, అధ్యాపకులకు వివరించారు. అలాగే డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ సమాచారం సలహాలు, ఫిర్యాదుల కొరకు సెబ్ టోల్ ఫ్రీ నెంబర్ 14500కు సంప్రదించవచ్చునని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అంతేకాకుండా బానిస కావద్దని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిశేషయ్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.