విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : నెల్లూరు నుంచి చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నెల్లూరులో ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడిగేడుతున్న సందర్భంగా చెన్నైలోని మీనాక్షి డెంటల్ హాస్పిటల్ కాలేజ్ వారి సహకారంతో 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 13వ తేదీ ఆదివారం నెల్లూరులో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నెలల పిల్లల మొదలుకొని వయోవృద్ధుల వరకు ముఖ్యంగా గ్రహణ మొర్రి, గ్రహణ సుల, ముఖము వంకర, పెదవుల వంకర, చిరునాలిక చీలిక, దవడలు వంకర, వంటి సమస్యలు కలిగిన వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది.అలాగే వారికి అవసరమైన మందులు రానుపోను రవాణా చార్జీలతో పాటు ఆపరేషన్ సమయంలో వారి ఉండటకు గదులు కూడా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు ఎస్వీ రమేష్ బాబు శుక్రవారం నెల్లూరులో తన చాంబర్లో
జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ శిబిరంలో పేర్లు నమోదు చేయించుకోవాల్సినవారు క్రిందినెంబర్లను9399999990,9399999951 సంప్రదించవలసిందిగా వారు కోరారు ఈ సమావేశంలో డాక్టర్ నాగేంద్రప్రసాద్,అనిత తదితరులు పాల్గొన్నారు.