విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో శుక్రవారం హెడ్ కానిస్టేబుల్ చాంద్ బాష కుమార్తె ముస్కాన్ కు డిఎస్పి గంగయ్య చేతుల మీదుగా బ్యాట్మెంటన్ కిట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు నభ్యసిస్తూ క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.ఇటీవలే జరిగిన బ్యాట్మింటన్ యు-11 కేటగిరి పోటీలలో హెడ్ కానిస్టేబుల్ చాంద్ బాషా కుమార్తె ముస్కాన్ జిల్లా స్థాయిలో విన్నర్ అయిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవడంతో ఆ చిన్నారిని ప్రోత్సహించడానికి తాడపత్రి సబ్-డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కలసి చిరు కానుకగా ఆ చిన్నారికి షటిల్ రాకెట్, బ్యాట్మింటన్ షూస్ అందజేసినారు. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా విజయం సాదించాలని ఆశీర్వదించినారు.