విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుదిలి సుదర్శన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీలో కేంద్రాలలో నిరసన కార్యక్రమాలలో భాగంగా అసెంబ్లీ కన్వీనర్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఆర్డీఓకు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షం లో ఉన్నపుడు విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రధానమైన హామీ ఇచ్చినటు వంటి జగన్మోహనరెడ్డి, అధికారం లోకి వచ్చిన తరువాత తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.గతం లో ఆయన ప్రతిపక్షం లో ఉన్నపుడు ధర్మవరం లో చేపట్టిన చేనేత దీక్ష లో జగన్ ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు.
విద్యుత్ చార్జీలు పెంచడం వలన సామాన్య ప్రజానీకం తో పాటు పరిశ్రమ యజమానులు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో భవిష్యత్ లో బీజేపీ ప్రజా ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్ కుమార్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జింకా.చంద్రశేఖర్, సాకే.ఓబిలేసు,గొట్లూరు.చంద్ర,పట్టణ అధ్యక్షులు డిష్.రాజు,అసెంబ్లీ కో కన్వీనర్ చట్టా నారాయణ స్వామి,చేనేత సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు గుండా పుల్లయ్య,కిసాన్ మోర్చా రీసెర్చ్ సెల్ కో కన్వీనర్ ప్రకాష్ నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాప్తాటి. రాము , యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి,మైనారిటీ మోర్చా జిల్లా కార్యదర్శి నబిరసూల్,తాడిమర్రి మండల అధ్యక్షులు పోతలయ్య,రూరల్ మాజీ అధతదితరులు పాల్గొన్నారు.