విశాలాంధ్ర -శెట్టూరు : అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెల పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం 18వ రోజు లో భాగంగా నిరాహార దీక్ష చేపట్టారు అంగన్వాడీ మండల అధ్యక్షులు అపర్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 18 రోజు నుంచి నిరసన ఆందోళన చేపడుతున్న కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన చెందారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరాహార దీక్షలో కూర్చున్నారు రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పైన స్పందించకపోవడం నీచమైన చర్య అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండు పరిష్కరించ లేనప్పుడు రాబోయే రోజుల్లో ఉదృతంగా వివిధ రకాల అందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్ యూనియన్ పైన ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, అంగన్వాడి వర్కర్లు జీతాలు పెంచాలని, న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈరోజు నిరాహార దీక్షలో కామాక్షమ్మ, లక్ష్మీదేవి, పార్వతి, తిమ్మక్క, రేణుక, అరుణ జ్యోతి, ద్రాక్షాయిని సుజాత, కవిత, సరోజమ్మ, వన్ను రక్క, సరస్వతి గౌరీ, గంగాదేవి అంగన్వాడి కార్యకర్తలు సహాయకులు తదితరులు పాల్గొన్నారు