Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మమ్మల్ని మనుషులుగా గుర్తించండి.. నివాస గృహాలకు రేకులు ఇప్పించండి

దుర్భర స్థితిలో ఉన్న మా గృహాలు, బ్రతుకులు చూడండి.

పాలకులు, అధికారులు స్పందించాలని కోరుతున్న యస్ సీ కాలనీ వాసులు.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బ్రతుకు తెరువు కోసం మన్య ప్రాంతాన్ని నమ్ముకుని తరతరాలుగా చింతపల్లి తో పాటు పరిసర గ్రామాలలో స్థిరపడిన మాదిగలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఆనాటి పెద్దలు గ్రామానికి చివరగా ఉన్న ప్రదేశం లో కొంత స్థలాన్ని కేటాయించి యస్ సి కాలనీ గా నామకరణం చేశారు. నాడు తక్కువ కుటుంబాలుగా ఉన్న వారి సంఖ్య పిల్లల వివాహాలు, వారి కుటుంబాలతో నేడు స్థానిక యస్ సి కాలనీ లో సుమారు 130 యస్ సి కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా నిరుపేదలు కావడంతో సరైన గృహాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారు. తాతలు, తండ్రులు నిరుపేదలు, నిరక్షరాస్యులు కావడంతో పూరి గుడిసె ల్లోనే నివసించి ఏ పూటకు ఆ పూట పొట్ట పోసుకునే కూలి పనులతో కాలం వెళ్ళ దీశారు. ఆ కాలంలో సరైన సంపాదన లేక పొట్ట కూటి కోసం మాత్రమే పరితపించిన మాదిగలను నాటి పాలకుల నుంచి నేటి పాలకుల వరకు కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నారు. ఐదవ షెడ్యూల్ ఏరియా కావడం వలన గిరిజనేతరులకు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు వర్తించవు అని చెప్పడం తప్ప తాము కూడా మానవులే అని గుర్తించడం లేదని మాదిగలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగం తమకు నివాస గృహాలకు కనీసం రేకులు కూడా ఇవ్వొద్దని చెప్పిందా అని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి, విద్యాదీవెన తదితర పథకాల పుణ్యమా అని తమ పిల్లలు కూడా మంచి విద్యను అభ్యసిస్తున్నారని, కానీ సరైన నివాసం లేక వృద్ధులు, చిన్నారులు, వ్యాధి గ్రస్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మీ, దార బాబు, అప్పారావు లు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మాదిగల నివాస గృహాలకు కనీసం రేకులు ఇప్పించవలసిందిగా వారు అభ్యర్థిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img