విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న చెన్నకేశవులు కుమార్తె సాయి కీర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఎంఏ ఇంగ్లీష్ లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం కైవసం చేస్తుందని తండ్రి చెన్నకేశవులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కుమారి సాయి కీర్తి చదువులో చిన్నప్పటినుండి పట్టుదలతో చదువుతూ, కుటుంబ ప్రోత్సాహంతో నేడు ఎంఏ ఇంగ్లీషులో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ సీతారామారావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా అందుకోవడం శుభదాయకమని తెలిపారు. తదుపరి పోలీస్ బృందం తో పాటు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి సాయి కీర్తికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం పట్ల ధర్మవరం నకు మంచి కీర్తి ప్రతిష్టలు తేవడం గర్వించదగ్గ విషయమని విద్యావేత్తలు తెలిపారు. కృషి, పట్టుదల, తపన ఉంటే విద్యలో దేనినైనా సాధించవచ్చునని పలువురు తెలిపారు.