విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మున్ముందు కూడా మీ సహకారం మాకు అవసరమని ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీపీగా మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచేందుకు ఎమ్మెల్యేగా తమ సహకారం అవసరమన్నారు. 2024 లో జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో మరో మారు మీరు ఎమ్మెల్యేగా గెలుపొందాలని, అదే క్రమంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.