Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రానున్నవన్నీ మంచి రోజులే

తెదేపా పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ ఈశ్వరి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- 2024లో రానున్నవన్నీ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులేనని తెదేపా పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. నూతన సంవత్సర ప్రారంభం రోజు అయిన సోమవారం ఆ పార్టీ చింతపల్లి మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మండల నాయకులు గిడ్డి ఈశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైకో పాలనకు చరమగీతం పాడేందుకు, సైకిల్ పాలనతో రాష్ట్ర ప్రజలకు సంక్షేమాభివృద్ధితో సుపరిపాలనను అందించేందుకు అవకాశం రానుందన్నారు. మరో వంద రోజులు ఓపిక పడితే వైకాపా ఇంటికి, తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమెను కలిసిన వారిలో మండల ఉపాధ్యక్షుడు ఆండ్రాబు లక్ష్మణ్, ఐ టి డి పి నాయకుడు శ్రీధర్, అబ్బాయి నాయుడు, కోటేశ్వరరావు, చెన్నకేశవ నాయుడు, యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img