ముంబయి: ఎవరైనా పెట్టుబడి పెట్టడంలో నైపుణ్యం కలిగి ఉంటే, అతను/ఆమె ఖచ్చితంగా ఐక్యూ మరియు లెక్కలు వేయడంలో కూడా మంచి నైపుణ్యంతో ఉంటారని చాలా మంది నమ్ముతారు. దీనికి విరుద్ధంగా, ఈ ప్రపంచంలో సగటు ఐక్యూ ఉన్న పెట్టుబడిదారులు సైతం తమ మనసును నియంత్రించడం, సరైన సమయంలో హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అసాధారణ రాబడిని, సంపదను సృష్టించారని ఆలిస్ బ్లూ సీఈఓ అండ్ వ్యవస్థాపకుడు సిధవేలాయుధం అన్నారు. మార్కెట్ పతనం సమయంలో పెట్టుబడిదారుడి ఆలోచనలు సరైన దిశలో సాగవని, సాధారణంగా, ఈ పరిస్థితిలో, పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతారని, పతనానికి అసలు కారణాన్ని అర్థం చేసుకోకుండా తమ పెట్టుబడులను ఉపసంహరించటం చేస్తారని తెలిపారు. మరోవైపు, చాలా మంది తెలివైన పెట్టుబడిదారులు చాలా ఆకర్షణీయమైన వాల్యుయేషన్తో ఎక్కువ కొనుగోలు చేసే అవకాశంగా దీనిని చూస్తారన్నారు. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు గరిష్ట స్థాయిని తాకడంతో పాటు మార్కెట్ దాదాపు ప్రతిరోజూ ఆల్-టైమ్ గరిష్టాలను తాకుతున్న పరిస్థితికి దారితీసిందని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా, వారి మనస్సులో ఎల్లప్పుడూ భద్రత మార్జిన్ ఉండాలని, ఇది ప్రస్తుత మార్కెట్ ధర, స్టాక్ అంతర్గత విలువ మధ్య వ్యత్యాసమన్నారు. మార్కెట్ పతనం జరుగుతున్నట్లు చూస్తే, ప్రస్తుత మార్కెట్ ధర, నిజమైన అంతర్గత విలువ మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూడాలని, నిజానికి, హేతుబద్ధమైన పెట్టుబడిదారులు ఆ సమయంలో స్టాక్లు చాలా తక్కువగా ఉన్నందున ఈ అవకాశాల కోసం ఎక్కువ కొనుగోలు చేయడానికి వేచి ఉంటారని తెలిపారు.