శ్రీ సత్య సాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, ఆర్గనైజర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: యోగాసనాల అభ్యసనలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని శ్రీ సత్య సాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి ఆర్గనైజర్ నరసింహులు, అనంతపురం వివేకానంద యోగా కేంద్రం ఆర్గనైజర్ దివాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 12వ తేదీన యోగాసనా పోటీల యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ నెల 12వ తేదీన వివేకానంద జయంతి ని పురస్కరించుకొని యోగాసనాల పోటీలు అనంతపురం పట్టణంలోని వివేకానంద పార్కు హరిహర దేవాలయం దగ్గర అశోక్ నగర్ నందు ఉదయం 8 గంటల నుంచి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. బాల బాలికల వయస్సు 9 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు, తదుపరి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు కచ్చితంగా 10 యోగాసనాలు చేయాలని తెలిపారు. ప్రవేశ రుసుము 100 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల యోగాసాధకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9396570362 కు గాని 8074145733 గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.