రోమ్: ఇటలీలో భారతీయ విద్యార్థి అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ స్పందించలేదు. కంగారు పడి ఇంటి యజమానికి ఫోన్ చేయగా వారు ఆరా తీసి బాత్రూమ్లో రామ్ రౌత్ విగతజీవిగా కనిపించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అద్దె ఇంట్లో ఉన్న రామ్ మృతదేహం వేరొకరి ఇంటి బాత్రూమ్లో కనిపించడం అనుమానానికి తావిచ్చింది. అయితే పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటన 2వ తేదీన జరిగింది. రామ్ రౌత్ ఎంబీఏ చదవడానికి ఇటలీ వెళ్లాడు. ఆయన జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాకు చెందిన వారు. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సాయం చేయాలని రామ్ కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన గురించి హోంశాఖకు, జార్ఖండ్ మైగ్రేషన్ విభాగానికి సమాచారం ఇచ్చామని, రామ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ కమిషనర్ అనన్య మిత్తల్ వెల్లడిరచారు.