బీజేపీ మంత్రిపై గెలిచిన కూనూర్
జైపూర్: రాజస్థాన్కు చెందిన కరణ్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సోమవారం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనూర్ తన ప్రత్యర్థి, బీజేపీ మంత్రి సురేంద్ర పాల్ సింగ్పై 11,283 ఓట్ల తేడాతో గెలిచారు. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పేర్కొన్న వివరాల ప్రకారం, కూనర్కు 94,950 ఓట్లు రాగా, సింగ్కి 83,667 ఓట్లు వచ్చాయి. 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ‘నాకు ఓటు వేసిన కరణ్పూర్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేంద్ర మంత్రులు కూడా ప్రచారానికి వచ్చారు (కానీ) ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు’ అని కూనూర్ విజయం సాధించిన తర్వాత విలేకరులతో అన్నారు. ఇంతకుముందు ఈ స్థానానికి కూనూర్ తండ్రి దివంగత గుర్మీత్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ స్థానానికి జనవరి 5న పోలింగ్ జరిగింది. కాగా, 199 స్థానాలకు గాను 115 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజస్థాన్ మంత్రివర్గంలో సురేంద్ర పాల్ సింగ్ చేరారు. నిబంధనల ప్రకారం మంత్రిగా చేరిన తర్వాత అసెంబ్లీకి ఎన్నిక కావడానికి ఆరు నెలల సమయం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మృతి చెందడంతో కరణ్పూర్ స్థానానికి ఎన్నిక వాయిదా పడిరది. ఆ తర్వాత ఆ స్థానం నుంచి ఆయన కుమారుడిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.