రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి
విశాలాంధ్ర-శింగనమల : నిజాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజల్లో ఆదరాభిమానాలు మన్ననలను చూర గొం టున్నదని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు, శుక్రవారం ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో2024 నూతన సంవత్సర విశాలాంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు,అనంతరం ఆయన మాట్లాడుతూ! ప్రజా సమస్యల సాధనకై అనునిత్యం పాటుపడుతూ పేదల పక్షపాతిగా నిలిచిందన్నారు, విశాలాంధ్రదినపత్రిక దినదినా భివృద్ధి చెందుతూ పేదల పక్షపాతిగా ముందుకు సాగుతోందని, పత్రికలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా పత్రికల పోటీ విధానాన్ని తట్టుకొని 72 వసంతాలు పూర్తి చేసుకున్న మేటి పత్రిక అని కొనియాడారు, విశాలాంధ్రదిన పత్రిక ప్రజల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర రిపోర్టర్ వరికోటి శంకర్ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు