విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు స్వామి వివేకానంద జయంతిని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏ సి ఆర్ దివాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శశాంక మౌళి పాల్గొన్నారు వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ… ప్రతి ఏటా జనవరి 12 వ తేదీన జాతీయ యువజనోత్సవంగా జరుపుకుంటామని దేశం నిర్మాణానికి యువతరం మూల స్తంభం లాంటి వారని ఎన్నో అవకాశాలు ఉన్నాయని మీరు వాటిని అందుపుచ్చుకోవాలంటే మీరు నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. మీరు అనుకున్నది సాధించవచ్చు అని, స్మార్ట్ ఫోన్ను తక్కువగా వినియోగించాలని దీని ద్వారా సమయం సద్వినియోగం చేసుకోవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని వాటిని సాధించడానికి కావాల్సిన మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు బాలాజీ నాయక్, సోమశేఖర్, విష్ణుప్రియ, శ్రీనివాసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమణ,పల్లవి, లక్ష్మీకాంతం, రంగనాథ్,రామకృష్ణ, అనంతరెడ్డి, తదితర అధ్యాపక బృందం, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు