విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ప్రతి ఉద్యోగికి నిబద్ధత ఎంతో అవసరమని ధర్మవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను నిర్వహించారు. ఈ సభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు నగదు బహుమతిని డిపో మేనేజర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఆర్టీసీ డిపో వెనుక ఉద్యోగుల యొక్క శ్రమ, తపన, పట్టుదల ఉంటేనే ఆర్టీసీ డిపోలు ఆదాయముకు నోచుకుంటాయని తెలిపారు. ప్రయాణికులే మన దేవుళ్ళు అన్న స్ఫూర్తితో ప్రయాణికుడికి సేవా భావంతో కూడిన సర్వీసును అందించాలని తెలిపారు. అప్పుడే ప్రయాణికుడు ఆర్టీసీ సంస్థ పట్ల గౌరవ మర్యాదలతో మలుచుకుంటారని తెలిపారు. ఈ పీకే తేవడంలో ఐదు మంది కండక్టర్లు, అదేవిధంగా కేఎంపిఎల్ తెచ్చి, డీజల్ ను ఆదా చేసి,సంస్థకు ఆదాయాన్ని తెచ్చిన ముగ్గురు డ్రైవర్లు ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నగదు బహుమతి పొందిన వారిలో డ్రైవర్లు బి. ఆంజనేయులు, ఎం. నారాయణ, వి. ఆంజనేయులు కాగా, కండక్టర్లలో పి. రామ్మోహన్, కె. మధుసూదన్, డివి. ప్రసాద్, సివిఆర్ రెడ్డి, ఎస్. ఎస్. శ్రీనివాసులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇంచార్జ్ వెంకటేశులు, ఏఈ సికిందర్, టిఐ-3 శ్రీరాములు, ఏడిసీలు- ఎం సి జి రావు, మల్లికార్జున, యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.