శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి వ్యక్తి మానవ సేవను అలవర్చుకోవాలని, అప్పుడే మానవతా విలువలను పెంపొందించినట్లు అవుతుందని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మందికి భోజనపు ప్యాకెట్లను, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ అన్నదాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ భర్త వెంకటస్వామి వారి సహకారంతో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవలు అభినందించదగ్గ విషయమని తెలుపుతూ, వారికి ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రైలు ప్రయాణికులకు అల్పాహారం పంపిణీ:: శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం హౌరా ఎక్స్ప్రెస్ కు పాడేరు పోవు సాయి భక్తులకు 110 మందికి అల్పాహారములు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయి భక్తులు భజన మండలి వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి రైల్వే స్టేషన్ మాస్టర్ నరసింహా నాయుడు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి భజన మండలి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన మండలి నిర్వాహకులు పాల్గొన్నారు.