విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో సామాజిక సమతా సంకల్పం ర్యాలీ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు గోరకాటి పురుషోత్తం రెడ్డి కేత లోకేష్ పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మానవహారం నిర్వహించారు. అనంతరం కమిషనర్, చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల స్మారక విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానం నందు ఈనెల 19వ తేదీ ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి అందరూ పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి డాక్టర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి, టిపిఆర్ఓ సుబ్బరాయుడు ,మెప్మా సిబ్బంది, వాలంటీర్లు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.