కోచ్ పృద్వి వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన క్రీడాకారిని నవ్య ఎంపికైనట్లు కోచ్ పృద్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుంచి గుంతకల్లులో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో నవ్య ప్రతిభ కనపరచడం జరిగిందని ఇందులో భాగంగా నవ్య రాష్ట్రస్థాయి జూనియర్ కబడి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు నంద్యాలలో ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పోటీల్లో నవ్య పాల్గొంటుందని తెలిపారు. అనంతరం కోచ్ తో పాటు ఆర్డిటి ఆర్డి ప్రమీల, ఏటీఎల్ శ్రీనివాసులు, హాకీ కోచ్ అనిల్, క్రికెట్ కోచ్ రాజశేఖర్లు అభినందించారు.