విశాలాంధ్ర,కదిరి.నియోజకవర్గం. పరిధిలోని పలువురు వైసీపీ నుండి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి యశోద దేవి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో తలుపుల మండలం,పెద్దన్న వారి పంచాయతీ,సంగటి వారి పల్లి గ్రామ ప్రజలు 20 కుటుంబాలు,వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలోకి సాదర్వoగా పార్టీలోకి ఆహ్వానం పలికి పార్టీ కండువా వేశారు.అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో కందికుంట అన్నను అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తామని తెలిపారు.నేటి నుండి కందికుంట, నారా వారి కుటుంబాలతో మా ప్రయాణం సాగుతుందని పేర్కొన్నారు పార్టీలోకి చేరిన వారు బాల బయ్యప్ప, రెడ్డి శేఖర,మల్లి కార్జున, బయప్ప,రవీంద్ర, వెంకట సుబ్బయ్య, బాల బయ్యన్న,ఎర్ర మల్లయ్య, శంకర, ప్రసాద్, పాపయ్య,రమణ, మల్లేసు,రామ చంద్ర,కుమార్, తదితరులు చేరారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మెడ శంకర, రాం మోహన్, విశ్వనాథ్ రెడ్డి, శ్రీ శైలం రమణ,జయ చంద్ర,బాబజాన్,షేక్ భాషూ, రమణ,చిన్న మల్లేసు,వసంత నాయుడు,అమర,గట్టి అశోక్, తదితరులు పాల్గొన్నారు.