విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని హాసిని అనే బాలిక అనారోగ్య రీత్యా క్యాన్సర్ వ్యాధితో గత కొన్ని నెలలుగా బాధపడుతోంది. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు తల్లిదండ్రులు వైద్య చికిత్సలు అందించినా కూడా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న అయ్యప్ప సేవ మండలి గురుస్వామి విజయ్ కుమార్ ఆ కుటుంబం యొక్క బాధను అర్థం చేసుకొని, తనతోపాటు తన శిష్య బృందం ఇతరులు కలిసి రూ.1,11,500 లను ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం గురుస్వామి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆశనీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన శిష్య బృందానికి ఇతర దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అయ్యప్ప శిష్య బృందం ఇటువంటి మానవతా విలువలను పెంపొందింప చేసే కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల పట్టణ ప్రజలు అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేశారు.