విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల పలువురికి శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వగృహంలో, సతీమణి సుప్రియ రూ.1, 40,000 ఆర్థిక సహాయాన్ని పలువురికి అందించారు. ఇందులో భాగంగా పట్టణంలోని రాజేంద్ర నగర్ లోని వరాల వరసిద్ధి వినాయక దేవస్థాన నిర్మాణానికి 50,000, వైయస్సార్ కాలనీలోని అయ్యప్ప స్వామి భజన మందిరం ప్రహరీ గోడ నిర్మాణానికి 50వేల రూపాయలు, తిక్క స్వామి నగర్లో నూతనంగా నిర్మించబోయే కేదారేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి 40000 రూపాయలు, పోతుకుంట గ్రామానికి చెందిన రామ్మోహన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఆ కుటుంబానికి అతని భార్య సులోచనకు 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురికి ఇటువంటి ఆర్థిక సహాయ కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యే దంపతులు మానవతను చాటుకున్నారు.