విశాలాంధ్ర/ఖమ్మం: దక్షిణ భారత్లో ప్రఖ్యాతిగాంచిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నూతన స్టోర్ను ఆవిష్కరించింది. శనివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హాజరుకాగా, గౌరవ అతిథిగా కేఎంసీ మేయర్ పీ.నీరజ హాజరయ్యారు. పీఎంజే జ్యువెల్స్ బిజినెస్ హెడ్ శ్రీరామ్ రెడ్డి పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంజే జ్యువెల్స్ని ఖమ్మంకు తీసుకురావడం మాకు చాలా గౌరవంగా ఉందన్నారు. మేము ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేయాలనుకుంటున్నామన్నారు. మా బ్రాండ్ను ప్రతిబింబించే సౌందర్యం, హస్తకళను అనుభవించడానికి విచ్చేయాలని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో మొదటి ఆరు రోజుల్లో ఆభరణాలను కొనుగోలు చేసే కస్టమర్లకు లక్కీ బహుమతిగా గోల్డ్ కాయిన్ను ప్రత్యేక ఆఫర్గా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంజే జ్యువెల్స్ బిజినెస్ హెడ్ రామ్ రెడ్డితో పాటు ఖమ్మం పీఎంజే జ్యువెల్స్ స్టోర్ హెడ్ రాజశేఖర్ పాల్గొన్నారు.